తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని మరింత పెంచింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో కులాంతర వివాహాం చేసుకున్నవారికి ప్రభుత్వం తరపున ఇప్పటి వరకు ఇచ్చే ప్రోత్సాహాకాన్ని రూ.50 వేల నుండి ఏకంగా మొత్తం రూ. 2.50 లక్షలకు పెంచింది.
దీనికి సంబంధించిన ఉత్తర్వులను ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ మిశ్రా నిన్న శుక్రవారం ఉత్తర్వులను జారీ చేశారు. ఇందులో భాగంగా కులాంతర వివాహాలకు ఎంపికైన జంటలకు బ్యాంక్ ఖాతాలో మూడేండ్ల కాల వ్యవధిలో రూ.2.50 లక్షలు ఫిక్సిడ్ డిపాజిట్ చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో ఇక నుంచి కులాంతర వివాహాలకు ఇచ్చే ప్రోత్సాహకాన్ని రూ.2.50 లక్షలు అందించాలని సంబంధిత అధికారులను అజయ్ మిశ్రా ఆదేశించారు.తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు ఐదేండ్ల కాలంలో మొత్తం 4,658 జంటలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా మొత్తం రూ.23.06 కోట్లు అందాయి.