తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలో పేదరికంతో బాధపడుతున్న హమాలీ కూలీ గంగ నర్సయ్య వైద్యం కోసం మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు.
ఈ క్రమంలో నర్సయ్య కడుపులో పేగులకు ఇన్ ఫెక్షన్ సోకింది. ప్రాణాపాయం ఉంది. దీనికి ఆపరేషన్ ఒక్కటే మార్గం అని వైద్యులు తేల్చి చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న మంత్రి కేటీ రామారావు నర్సయ్యను వెంటనే హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తీసుకురావాలని సూచించారు.
ఇదే ఏడాది జూన్ 11న నిమ్స్ లో చేరిన నర్సయ్య ఆపరేషన్ కోసం మంత్రి కేటీఆర్ రూ.2 లక్షల ఎల్వోసీను ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి ఇప్పించారు. ఈ ఆపరేషన్ జరిగిన కొన్నాళ్లకు ఇంకోసమస్య రావడంతో మరో రూ. 2 లక్షల ఎల్వోసీని మంజూరు చేస్తే జూన్ 19న రెండో సారి ఆపరేషన్ జరిగింది. మళ్లీ తిరిగి మూడో సారి మరో రూ.1.50 లక్షల ఎల్వోసీను మంజూరు చేయించి నర్సయ్యకు అండగా నిలిచారు మంత్రి కేటీఆర్..