మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత పుత్రుడు నారా లోకేష్ మొన్న నిరాహారదీక్ష చేసిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు ఆయన ఈ దీక్ష చేసారు. దాన్ని నిరాహార అని కూడా అంటారా అనే వార్తలు బలంగా వినిపించాయి. చిరుతిండ్లు లేకుండా నాలుగు గంటలు కూర్చున్న లోకేష్ కు నిమ్మ రసం ఇచ్చి దీక్ష విరమింప చేయడమేంటి అని ప్రశ్నించారు. నిరాహార దీక్షకు ఉన్న గౌరవాన్ని పోగొట్టారని మండిపడ్డారు.అయితే తాజాగా చంద్రబాబు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ విశాఖపట్నం వేదికగా 3కిలో మీటర్ల లాంగ్ మార్చ్ డ్రామా చేసారు. నదులు నిండుకుండల్లా పొంగుతుంటే రైతుల ఆనందాన్ని చూడలేకపోతున్న పార్ట్నర్స్. అవినీతిని సంపూర్ణంగా నిర్మూలిస్తూ, వ్యవస్థలను వైయస్ జగన్ బాగుచేస్తుంటే ఓర్వలేకపోతున్నారు.