తెలంగాణ ముఖ్యమంత్రి శనివారం నాడు క్యాబినెట్ సమావేశంలో భాగంగా మీడియా సమావేశంలో ఆర్టీసీ సమ్మెను ఉద్దేశించి మాట్లాడారు. ఈ సందర్భంగా మంగళవారం అర్థరాత్రిలోగా ఆర్టీసీ కార్మికులు విధుల్లోకి చేరాలని కోరారు. ఈమేరకు సమ్మె విరమణ దిశగా అడుగులు పడుతున్నాయి. అంతేకాకుండా విధుల్లోకి చేరిన వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. ఆయన పిలుపు మేరకు ఒక్కోకరుగా ఆర్టీసీ కార్మికులు ముందుకు వస్తున్నారు. స్వచ్ఛందంగా డిపోల్లో రిపోర్టు చేయడానికి వచ్చే కార్మికులను చాలా చోట్ల యూనియన్ నాయకులు అడ్డగిస్తున్నారు. అయినప్పటికీ ఆదివారం ఉదయం నుంచి పలు డిపోల్లో కార్మికులు రిపోర్టు చేస్తున్నారు.
*కామారెడ్డి డిపోకు చెందిన సయ్యద్ హైమత్ ఆర్టీసీ రెగ్యులర్ డ్రైవర్ (స్టాఫ్ నెంబర్ 318188) డ్యూటీ చేస్తానని DVM గణపతి రాజు గారికి రిపోర్ట్ చేసినారు.
*సిద్దిపేట డిపో లో పని చేస్తున్న కండక్టరు P. బాల విశ్వేశ్వరరావు గారు విధులలో చేరడానికి డిపోకు వచ్చారు.
*భద్రాచలం డిపోలో శేషాద్రి అనే కార్మికుడు విధుల్లో చేరడానికి వస్తే, యూనియన్ నాయకులు అడ్డుకున్నారు. కళ్లల్లో కారంపొడి పోశారు. వెనక్కి తిప్పి పంపారు.
*సిరిసిల్ల డిపో మెకానిక్ K.. శ్రీనివాస్ తను డ్యూటీ లో జాయిన్ అవ్వడానికి DM గారికి లెటర్ రాసి ఇచ్చివెళ్లారు.
*హయత్ నగర్ 2 డిపో డ్రైవర్ గౌస్ విధుల్లో చేరడానికి డిపోకు వచ్చారు.
*మిర్యాలగూడ డిపోకు చెందిన కండక్టర్ ఎస్.కె. ఎం. వలి తాను డ్యూటీలో చేరతానని డిపో మేనేజర్ కు లేఖ ఇచ్చారు.