తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు వచ్చే ఏడాది జనవరి నెలలో దావోస్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జనవరి నెలలో ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై నాలుగో తేది వరకు జరగనున్న ఫోరం 50వ సదస్సు(డబ్ల్యూఈఎఫ్)కు రావాల్సిందిగా మంత్రి కేటీఆర్ కు ఆహ్వానం అందింది.
ఈ సదస్సులో టెక్నాలజీ ప్రయోజనాలు.. అందులోని సవాళ్లపై చర్చించాలని మంత్రి కేటీఆర్ కు ఆ కమిటీ తరపున విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు వరల్డ్ ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షుడు బోర్డ్ బ్రెండే లేఖ రాశారు. గత యాబై ఏండ్లుగా ప్రపంచంలోని ప్రైవేట్ వ్యాపార వాణిజ్య రంగంలోని ప్రముఖ సంస్థలతో ప్రభుత్వ భాగస్వాములను చేయడంలో డబ్య్లూఈఎఫ్ ప్రముఖ పాత్ర పోషిస్తుందని ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు.