వైజాగ్లో నవంబర్ 4 న నిర్వహించిన లాంగ్ మార్చ్ సందర్భంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సీఎం జగన్, వైసీపీ నేతలపై పదునైన విమర్శలు చేశారు. రెండు వారాల్లో ఇసుక సమస్య పరిష్కరించకపోతే.. వైసీపీ నేతల తాట తీస్తా అంటూ పవన్ డెడ్లైన్ పెట్టి మరీ రెచ్చిపోయారు. పవన్ విమర్శలపై అంబటి రాంబాబు స్పందించారు. ఈ రోజు పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన అంబటి.. వైజాగ్లో పవన్ కల్యాణ్ చేసిన రెండున్నర కిలోమీటర్ల లాంగ్ మార్చ్ను అది లాంగ్ మార్చ్ అనాలో, షార్ట్ మార్చ అనాలో, కార్ మార్చ్ అనాలో అర్థం కావడం లేదని జోకులు వేశారు. అసలు ఈ లాంగ్ మార్చ్లో భవన నిర్మాణ కార్మికులు ఎక్కడా కనిపించలేదని, కేవలం జనసేన జెండాలు పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు మాత్రమే కనిపించారని ఎద్దేవా చేశారు. అది ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతంగా పాలన చేస్తుంటే… ఇక్కడ ఇద్దరు మూర్ఖులకు కనిపించడం లేదని బాబు, పవన్లను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెండువారాల్లో ఇసుక సమస్య తీర్చకపోతే అమరావతిలో పాదయాత్ర చేస్తానన్న పవన్ విమర్శలపై అంబటి స్పందించారు. అమరావతికి వెళ్లి అక్కడ అక్రమ నివాసం లింగమనేని గెస్ట్హౌస్లో లో ఉండొద్దని మీ పార్టనర్ చంద్రబాబుకు చెప్పగలరా అని పవన్ను ప్రశ్నించారు. మాట్లాడితే తాట తీస్తానని చెబుతున్న పవన్ కు మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ప్రజలే తాటతీసి మూలన కూర్చుండబెట్టి, వంగోబెట్టి, పడుకోబెట్టిన సంగతి గుర్తులేదా అని అంబటి ప్రశ్నించారు. పవన్ ముమ్మాటికి చంద్రబాబు దత్తపుత్రుడే, అందుకే బాబు ఎన్ని తప్పులు చేసినా ఆయన ప్రశ్నించడం లేదని అంబటి ఫైర్ అయ్యారు. నిన్నటి సభలో టీడీపీ స్క్రిప్టును పవన్ చదివి వినిపించారని, దీన్నిబట్టి టీడీపీ గెలిచిన సీట్లు 23 కాదు, 24 అని తేలిపోయిందని అంబటి వ్యంగంగా వ్యాఖ్యానించారు. జగన్పై విమర్శలు వైఎస్ జగన్ పోరాటాలు చూసే ఆయన్ని ప్రజలు సీఎంను చేశారు. పవన్, చంద్రబాబు ఒకటే అని ప్రజలు నమ్మారని, అందుకే జనసేనకు ఓటేస్తే టీడీపీకి వెళ్తుందనే ప్రజలు మా పార్టీని గెలిపించారని అంబటి అన్నారు. పవన్ కల్యాణ్ మొదటి నుంచి కన్ఫ్యూజన్, స్పష్టత లేని రాజకీయాలు చేస్తున్నారు. ఆయన ఇంతవరకు ఏం పోరాటం చేశారో చెప్పాలి. పార్టీనీ నడిపించలేక పోతే సినిమాలు చేసుకోండి.,, అంతే కాని సీఎం జగన్పై, వైసీపీ సర్కార్పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే సహించేది లేదని అంబటి పవన్ కల్యాణ్కు వార్నింగ్ ఇచ్చారు.