ఐపీఎల్ అంటే ప్రత్యేకించి ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఐపీఎల్ సీజన్ వస్తే చాలు క్రికెట్ అభిమానులకు పండగే. అటు స్టేడియంలో సిక్స్ కొట్టిన, అవుట్ అయినా ఇలా ప్రతీ విషయంలో కేరింతలే కేరింతలు. మరోపక్క చీర్ ఇలా రెండు నెలల పాటు పండుగ వాతావరణం నెలకొల్పుతుంది. అయితే ఇప్పటివరకు ఉన్న ఐపీఎల్ వేరు ఇప్పుడు కొత్తగా వచ్చేది వేరు. ప్రస్తుతం ఒక మ్యాచ్ కు 11మంది ఆటగాళ్ళు మాత్రమే ఉంటారు. కాని ఇప్పుడు 15మందిని తీసుకోక వారిలో ఓవర్ చివర్లో గాని లేదా వేరే విధంగా ఇంకో ఆటగాడితో రీప్లేస్ చేసుకునే ఛాన్స్ ఇవ్వనున్నారు. ఈమేరకు ముందుకు దీనిని ముష్తాక్ అలీ ట్రోపీలో ప్రారంభించనున్నారని తెలుస్తుంది. ఉదాహరణకు ఒక ఓవర్ లో 20రన్స్ కొట్టాలి ఆ సమయంలో బ్యాట్స్ మాన్ లేనప్పుడు, రసెల్ లాంటివారు బయట ఉంటే 11మంది టీమ స్క్వాడ్ లో లేనప్పటికీ అతడిని ఆడించవచ్చు.