Home / ANDHRAPRADESH / జనసేనానిపై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్..!

జనసేనానిపై కత్తి మహేష్ షాకింగ్ కామెంట్స్..!

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై వివాదాస్పద క్రిటిక్ కత్తి మహేష్ మరోసారి చెప్పరాని పదజాలంతో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఏపీ రాజధానిని పులివెందులలో, హైకోర్టును కర్నూలులో పెట్టుకోవాలంటూ పవన్ కల్యాణ్ జగన్‌పై వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. పవన్ వ్యాఖ్యలపై స్పందించిన కత్తి మహేష్ ఘాటుగా రియాక్ట్ అయ్యాడు. ఏరా పవన్ కల్యాణ్ అంటూ సంబోధిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మరోసారి అగ్గి రగిస్తున్నాయి. రాజధాని, హైకోర్ట్‌లపై రాయలసీమను ఉద్దేశించి పవన్ చేసిన వ్యాఖ్యలకు ఫేస్‌బుక్‌లో స్పందించాడు. ఏరా పవన్ కళ్యాణ్…పులివెందులలో రాజధాని, కర్నూలులో హైకోర్టు పెట్టుకోమని ఏకసెక్కలాడతావా? న్యాయబద్ధంగా రాయలసీమ ప్రజల హక్కులురా అవి పుండాకోర్! నీకు అది మజాక్ గా అనిపిస్తోందా? మళ్ళీ గుండుకావాలని కోరిక ఏమైనా కలుగుతోందా నీకు! ఖబడ్దార్ !! అంటూ కత్తి మహేష్ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు. అయితే ఈ పోస్ట్‌పై ఓ నెట్‌జన్ మీ భాష బాగాలేదని కామెంట్ చేయగా..పవన్ కళ్యాణ్ లాంటి బాధ్యతలేని బరితెగించి బానిసకు ఇంతకుమించిన మంచి భాష నా దగ్గరలేదు. నిజానికి నేను చాలా మర్యాదగానే ఇప్పటికి రాస్తున్నా. మీరు చిత్తగించాలి అంటూ కత్తి మహేష్ రిప్లై చేశాడు. కాగా పవన్‌కల్యాణ్‌కు గతంలో సీమ టీడీపీ నేత, స్వర్గీయ పరిటాల రవి గుండు కొట్టించాడంటూ రూమర్స్ ఉన్నాయి. పరిటాల రవిపై జీవితగాథపై రాంగోపాల్‌ వర్మ తీసిన రక్త చరిత్రలో కూడా ఓ సినీ హీరోలకు గుండు కొట్టించిన సీన్‌ ఉంది. ఇది దృష్టిలో పెట్టుకుని కత్తి మహేష్ కూడా రాయల సీమ ప్రజల హక్కులపై ఏకసెక్కాలు ఆడుతావా..మళ్లీ గుండూ కావాలని కోరిక ఏమైనా కలుగుతుందా…ఖబడ్దార్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ అధినేతను కించపర్చిన కత్తి మహేష్‌పై జనసేన శ్రేణులు మండిపడుతుండగా..రాయలసీమకు చెందిన నెట్‌జన్లు మాత్రం కత్తి మహేష్ వ్యాఖ్యలను సమర్థిస్తున్నారు. మొత్తంగా జనసేనానిపై కత్తి మహేష్ చేసిన కాంట్రవర్సీ కామెంట్స్‌ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి.

 

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat