ఇటీవల విడుదలైన మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో బీజేపీ,శివసేన మిత్రపక్షాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే ఎమ్మెల్యే స్థానాలను దక్కించుకున్న సంగతి విదితమే .ఈ క్రమంలో ఇటు బీజేపీ అటు శివసేన పార్టీలు మొదటి నుండి తమకు అంటే తమకు సీఎం పదవి కోసం పట్టుబడుతున్న సంగతి కూడా తెలిసిందే.
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అదినేత శరద్ పవార్ తో శివసేన నేతలు చర్చలు జరిపిన నేపథ్యంలో వీరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. చెరి సగం ఫార్ములా అమలు చేయవచ్చని ప్రచారం జరిగింది.
అయితే తాజాగా శరద్ పవార్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలోనే ఉంటామని స్పష్టం చేశారు. శివసేనతో చేతులు కలపడం లేదని ఆయన అన్నారు. శివసేన, బీజేపీలే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆయన అన్నారు.