తెలంగాణ రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సీఎం ,అధికార టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీపి కబురును అందించారు. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం (డీఏ)33.536% పెంచుతూ ఉత్తర్వులను జారీ చేసింది.
దీంతో పెంచిన కరువు భత్యాన్ని ఇదే ఏడాది జనవరి నెల ఒకటో తారీఖు నుంచి అమలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి కే రామకృష్ణారావు ఉత్తర్వులను నిన్న బుధవారం జారీ చేశారు. ఆయా శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు బేసిక్ పై 3.392 % నుంచి 33.536 % నికి డీఏ పెరుగుతున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఈ డీఏ పెంపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో పాటుగా జిల్లా మండల ప్రజాపరిషత్తులు,గ్రామ పంచాయతీలు,పురపాలకలు,పురపాలక కార్పొరేషన్లు,వ్యవసాయ మార్కెట్ల కమిటీలు,జిల్లా గ్రంథాలయ సంస్థలు,వర్క్ చార్జ్ డ్ ఎస్టాబ్లిష్మెంట్,ఎయిడెడ్ విద్యాసంస్థలల్లో టీచింగ్ ,నాన్ టీచింగ్ ,యూనివర్సీటీ ఉద్యోగులకు ఇది వర్తిస్తుంది. మొత్తం పెంచిన డీఏ నవంబర్ జీతంతో పాటు డిసెంబర్ ఒకటో తారీఖున వస్తుందని ఆ ఉత్తర్వుల్లో తెలిపారు.