టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపడుకుంటామని ప్రభత్వ ఛీప్ విప్ వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ అన్నారు. హన్మకొండలో వరంగల్ పశ్చిమ నియోజక వర్గ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్ , కార్పోరేటర్లు, పలువురు ముఖ్య కార్యకర్తలు పాల్గోన్నారు. అలాగే ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్ సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీ యూత్ నాయకులు టీఆర్ఎస్ లో చేరారు. పార్టీ బలోపేతానికి బూత్స్థాయి కమిటీలపై, డివిజన్ స్థాయి కమిటీలపై నియోజకవర్గ స్థాయి కమిటీలపై చర్చించారు. అనంతరం వినయ్భాస్కర్ మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలకు అండగా ఉంటామని, పార్టీ వారికి సముచిత స్థానం కల్పిస్తుందన్నారు. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన అన్నారు. సంక్షేమ పథకాలకు అర్హులందరికీ అందేలా చూడాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని వినయ్భాస్కర్ పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేసేందుకు 237 బూత్కమిటీల్లో ఆదివారం జెండాలు రెపరెపలాడాలని పిలుపునిచ్చారు.