తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,నకిరికేల్ శాసన సభ్యులు చిరుమర్తి లింగయ్య కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
నల్లగొండ జిల్లా కేతిరెడ్డి మండలంలోని భీమారం గ్రామంలో ఐకేపీ(ఇందిరా క్రాంతి పథం) ఆధ్వర్యంలో వారు లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ” తెలంగాణ ప్రభుత్వం అన్ని పంటలకు గిట్టుబాలు ధర ప్రకటించింది.
పత్తి, మొక్కజొన్న మొదలగు పంటలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లోనే విక్రయించాలి. కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకుని పంటకు సరైన లాభం పొందాలని సూచించారు. దళారులకు విక్రయించి అనవసరంగా మోసపోవద్దని వారు ఈ సందర్భంగా రైతులకు సూచించారు.