తన అందచందాలతో కూడిన చక్కని నటనతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ స్థానాన్ని సంపాదించుకున్న టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఇప్పటివరకు ఇరవై ఐదుకు పైగా సినిమాల్లో ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించి మెప్పించింది.
ఇదే ఏడాది దేదే ఫ్యార్ దే మూవీతో ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. అంతేకాకుండా ఈ నెల పదిహేనో తారీఖున విడుదల కానున్న రెండో చిత్రం మర్జవాన్.
ఈ సందర్భంగా రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ” ఇప్పటివరకు దాదాపు ఇరవై ఐదు మూవీల్లో నటించాను. ఇక నుండి బాలీవుడ్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టనున్నట్లు ఆమె తెలిపింది. ప్రస్తుతం మూడు హిందీ సినిమాల గురించి చర్చలు జరిగాయి. త్వరలోనే వాటి వివరాలు వెల్లడిస్తానని ముద్దుగుమ్మ ప్రకటించింది.