ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా వచ్చే ఏడాది మార్చి నెలలో వైఎస్సార్ పెళ్ళి కానుక పథకాన్ని అమలు చేయనున్నట్లు విజయవాడలో జరుగుతున్న జాతీయ విద్యా దినోత్సవంలో పాల్గొన్న ముఖ్యమంత్రి జగన్ తెలిపారు.
అంతేకాకుండా ప్రస్తుతం ఇస్తోన్న పెళ్లి కానుక ఆర్థిక సాయాన్ని రూ. లక్ష వరకు పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మార్చి తర్వాత మసీదుల సంఖ్య పెంచుతామన్నారు.
ముస్లీం సోదరులకు ఇచ్చిన ప్రతి హామీను నెరవేరుస్తాము. తాను నడిచిన పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఎన్నికల హామీని నెరవేర్చి మరల మీ ముందుకు ఓట్లు అడగటానికి వస్తానని”తేల్చి చెప్పారు.