అనంతపురం జిల్లా ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే, ఏపీ ప్రజా పద్దుల సంఘం ఛైర్మన్ (పీఏసీ) పయ్యావుల కేశవ్ స్వల్ప అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. అమరావతిలో పీఏసీ సమావేశం జరుగుతుండగా ఆయన అస్వస్థత గురి కావడంతో ఆయనను ఇటీవల ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న ఆయనను టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరామర్శించి, కొద్ది సేపు మాట్లాడారు. వైద్యులతోనూ మాట్లాడి పయ్యావుల కేశవ్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. కేశవ్ త్వరగా కోలుకుంటారని ఆశిస్తున్నాను’ అని చంద్రబాబు ఫేస్ బుక్ ద్వారా తెలిపారు.
అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ గారిని,…
Posted by Nara Chandrababu Naidu on Sunday, 10 November 2019