ఆదివారం రాత్రి ఓడిస్సా లోని ఒక ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఛార్జింగ్ పెట్టిన మొబైల్ పేలడంతో నయాగర్ కు జిల్లా రాన్పూర్ గ్రామానికి చెందిన కునా ప్రధాన్ అనే వ్యక్తి మరణించాడు. వివరాల్లోకి వెళ్తే ఆయన గత రెండు నెలలుగా జగన్నాథ్ ట్రక్ ఓనర్స్ అసోసియేషన్ కార్యాలయ ప్రాంగణంలో ఆలయ నిర్మాణంలో పనిచేస్తున్నాడు.ఆదివారం రాత్రి ఆయన ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టి పడుకున్నాడు. అనంతరం పేలుడు సంబవించింది. సోమవారం ఉదయం ఆ సమీపంలో ఉన్న కొందరు కార్మికులు గది లోపల పొగ గమనించి ఏమిటా అని వెళ్లేసరికి ఆయన మరణించాడని అంటున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఉదయం స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు.