తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ పాలనలో గిరిజనులు అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో విద్యారంగంలో అభివృద్ధి చెందుతున్న గిరిజనులు ఆయా రంగాల్లో తమదైన ముద్ర వేసుకుంటున్నారు.
రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొస్తున్న విద్యా సంస్కరణల వలన గిరిజనలు విద్య రంగంవైపు అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలోని ఆశ్రమ పాఠశాలలు,సంక్షేమ వసతి గృహాలు,బెస్ట్ అవెలబుల్ స్కూళ్లు,ప్రాథమిక,మినీ ,గిరిజనుల గురుకులాలు ఇలా పలు సంస్థల ద్వారా మొత్తం 2,15,898 మంది గిరిజన విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.
గిరిజన గురుకుల్లాలో పదోతరగతిలో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది రూ.5వేల నగదు పురస్కారం అందజేస్తూ ప్రోత్సహించడమే కాకుండా పలు కార్యక్రమాలను అమలు చేయడమే దీనికి ప్రధాన కారణమని విశ్లేషకులు చెబుతున్నారు.