అగ్రిగోల్డ్ బాధిత కుటుంబాల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెలుగులు నింపారు. అగ్రిగోల్డ్ ఏపీలో రూ.3,944 కోట్లు వసూలు చేసి లక్షల మందిని దగా చేసింది. టీడీపీ అదికారంలో ఉండి అగ్రిగోల్డ్ బాదితులను మోసగించింది. మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొదటి కేబినెట్ సమావేశంలో రూ.1,150 కోట్లు కేటాయించారు. జగన్ ప్రతిపక్ష నాయకుడి హోదాలో మాట ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో ఇచ్చిన మాటను నిలుపుకున్నారు. పాలకులు మంచివారైతే ప్రజలు సుభిక్ష్యంగా ఉంటారనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది. అయితే వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత నిర్వహించిన ప్రతి కార్యక్రమంలోనూ ప్రతి రైతు ప్రభుత్వం అని విమర్శించిన తెలుగుదేశం పార్టీ జనసేన లు ఇప్పుడు మాత్రం కనీసం మాట్లాడటం లేదు. తాము చేయలేని పనిని జగన్ చేసి చూపించారని దీనిపై ఎక్కువగా మాట్లాడితే క్రెడిట్ కూడా ప్రభుత్వానికే వెళ్తుందనే ఉద్దేశంతోనే అగ్రిగోల్డ్ విషయంలో టిడిపి జనసేన స్పందించలేదు.