ఆదివారం నాగపూర్ వేదికగా ఇండియా, బంగ్లాదేశ్ మధ్య మూడో టీ20 జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఇందులో బాగంగా ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది బంగ్లా. అయితే భారత్ నిర్ణీత 20ఓవర్లకు 174 పరుగులు చేసింది. అనంతరం చేజింగ్ కు వచ్చిన బంగ్లాదేశ్ ఆదిలోనే 2 వికెట్లు కోల్పోయింది. అయినప్పటికీ నయీం అద్భుతమైన బ్యాట్టింగ్ తో భారత్ విజయ అవకాశాలపై నీళ్ళు జల్లాడు. అయితే ఒక్కసారిగా వారిని దెబ్బకోట్టాడు దీపక్ చాహర్. తన అద్భుతమైన స్పెల్ తో ప్రపంచ రికార్డ్ ను బ్రేక్ చేసాడు. 3.2 ఓవర్స్ లో 7పరుగులు ఇచ్చి 6వికెట్లు పడగొట్టాడు. దాంతో అంతకుముందు మెండిస్ పెరట ఉన్న రికార్డును బ్రేక్ చేయడమే కాకుండా ఇండియా తరుపున టీ20ల్లో హ్యాట్రిక్ తీసిన మొదటి ప్లేయర్ గా నిలిచాడు. మరోపక్క క్రికెట్ అభిమానులు చాహర్ లాంటి బౌలర్ ఇలాంటి ప్రదర్శన చూపడం ధోని వల్లనేనని అంటున్నారు. ఎందుకంటే ఈ బౌలర్ ధోని సారధ్యంలో చెన్నై కి ఆడుతున్నాడు.