తెలంగాణ రాష్ట్ర రాజధాని మహనగరం హైదరాబాద్ ను దేశానికి రెండోరాజధానిగా చేస్తారని కేంద్ర అధికార బీజేపీకి చెందిన సీనియర్ నేత,మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఇటీవల వ్యాఖ్యానించిన సంగతి విదితమే.
తాజాగా హైదరాబాద్ యూటీ చేస్తారనే వార్తలపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ” తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ ను యూటీ చేయాలనే ఆలోచన కేంద్రానికి కానీ బీజేపీకి కానీ లేదని ఆయన స్పష్టత నిచ్చారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ” హైదరాబాద్ ను యూటీని చేయాలని చర్చలు అసలు మా పార్టీలో జరగలేదు. మా పార్టీకి చెందిన ఎవరైన నేతలు దాని గురించి మాట్లాడితే అది వారి వ్యక్తిగత అభిప్రాయమే తప్పా పార్టీ నిర్ణయం కాదు”అని ఆయన తేల్చి చెప్పారు.