టీమిండియా ఓపెనర్ మయాంక్ అగర్వాల్ అనుకునట్టుగానే డబుల్ సెంచరీ కొట్టేసాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ లో ఇది రికార్డ్ అనే చెప్పాలి. హేమాహేమీ ఆటగాలు అవుటైనా అతడు మాత్రం నిలకడగా ఆడి ఈ ఫీట్ సాధించాడు. కాని మొదటిసారి అగర్వాల్ ని చూస్తుంటే సెహ్వాగ్ గుర్తొచ్చాడు. సిక్స్ తో తన డబుల్ సెంచరీ సాధించాడు.మొన్న సౌతాఫ్రికా నేడు బంగ్లాదేశ్ ఎవ్వరినీ వదలడం లేదనే చెప్పాలి. వచ్చిన అవకాశాన్ని బాగా వినియోగించుకున్నాడు. మరోపక్క కోహ్లి ఇందాక సెంచరీ కాదు డబుల్ కావాలి అని చెప్పగా ఇప్పుడు డబుల్ సెంచరీ సాధించాక ట్రిపుల్ కావాలని సైగా చేసాడు. మరి చేస్తాదంటారా..? అదేగాని జరిగితే రికార్డ్ అనే చెప్పాలి.