టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని రికార్డును బ్రేక్ చేసాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లి. ఇక ధోని విషయానికి వస్తే టెస్టుల్లో టీమిండియాను ఒక రేంజ్ కు తీసుకొచ్చిన ఘనత ధోనిదే అని చెప్పాలి. టెస్టుల్లో భారత్ ను అగ్రస్థానంలో నిలిపాడు. అనంతరం కొన్ని రోజుల తరువాత ధోని రిటైర్మెంట్ తర్వాత కోహ్లి ఆ భాద్యతలను స్వీకరించాడు. అయితే ధోని సారధ్యంలో భారత్ టెస్టుల్లో ఇన్నింగ్స్ తేడాతో 9సార్లు గెలుచుకుంది. అయితే ఇప్పుడు ఆ రికార్డు ను కోహ్లి బ్రేక్ చేసాడు. కోహ్లి కెప్టెన్సీలో నిన్న బంగ్లాదేశ్ మ్యాచ్ తో కలిపి 10సార్లు ఇన్నింగ్స్ తేడాతో గెలిచింది భారత్.