తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత నలబై ఐదు రోజులుగా ఆర్టీసీ సిబ్బంది సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. ఈ క్రమంలో ప్రజలకు ,ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలు జాగ్రత్తలను తీసుకుంటుంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్సులను,ప్రయివేట్ బస్సులను నడుపుతున్నారు. నిన్న ఆదివారం ఒక్క రోజునే తెలంగాణ వ్యాప్తంగా మొత్తం ఆరవై తొమ్మిది శాతం బస్సులు నడిచినట్లు అధికారులు చెబుతున్నారు. ఆదివారం ఒక్కరోజునే మొత్తం 6114బస్సులను నడిపినట్లు అధికారులు చెబుతున్నారు. దీనిలో 4,189ఆర్టీసీకి చెందిన బస్సులు కాగా 1925 అద్దె బస్సులున్నాయి. మొత్తం 4,189మంది తాత్కాలిక డ్రైవర్లు,6114మంది తాత్కాలిక కండక్టర్లు తమ విధులను నిర్వహిస్తున్నారు. వరంగల్ రీజియన్ లో మొత్తం ఆరు వందల ఎనబై బస్సులు నడిచాయి.