కర్నూల్ జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పెళ్లైన వారం రోజులు కూడా గడవక ముందే తన వైవాహిక జీవితానికి ఓ నవ వధువు స్వస్తి పలకాలనుకుంది. అత్తవారి ఇంటికి వచ్చిన భార్య.. భర్తకు విషం ఇచ్చిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. వివరాలు.. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన లింగమయ్యకు వారం రోజుల క్రితం మదనంతపురం గ్రామానికి చెందిన నాగమణితో వివాహం జరిగింది. అయితే కుటుంబ సభ్యులు ఇష్టం లేకున్నా కూడా బలవంతంగా లింగమయ్యతో నాగమణి పెళ్లి చేశారని తెలుస్తుంది.
ఈ క్రమంలో తనకు ఇష్టం లేని పెళ్లి చేశారనే కోపంతో అత్తవారింటికి వచ్చిన నాగమణి భర్తకు పాలల్లో విషం కలిపి ఇచ్చింది. వీటిని తాగిన లింగమయ్య అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. కడుపులో నొప్పి వచ్చింది. అది రెగ్యులర్ నొప్పి కాదు. సూదులతో పొడుస్తున్నట్లు… గుద్దుతున్నట్లు రకరకాలుగా అనిపించింది. తట్టుకోలేకపోయాడు. గిలగిలా కొట్టుకుంటూ కిందపడ్డాడు. ఆమెతోపాటూ… అత్తమామలు, బంధువులూ అంతా పరిగెత్తుకొచ్చారు. దీంతో అతడిని కుటుంబ సభ్యులు హుటాహుటిన గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన గుత్తి పోలీసులు ఈ కేసును దర్యాప్తులో భాగంగా జొన్నగిరి పోలీసు స్టేషన్కు బదలాయించారు.
విషం ఎందుకిచ్చింది అనేవిషయం ఇంకా తేలలేదు. లింగమయ్యను ఇంటరాగేట్ చేసిన పోలీసులు… నెక్ట్స్ అతని అత్తారింటికి వెళ్తామని తెలిపారు. అక్కడ అసలు విషయం రివీల్ అవుతుందని భావిస్తున్నారు. జనరల్గా పెళ్లి ఇష్టంలేకపోయినా, ఆల్రెడీ ఎవర్నైనా ప్రేమిస్తూ ఉన్నా… అలాంటి వాళ్లు ఇలాంటి విషపూరిత నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు.