ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అయినటువంటి నారా లోకేష్పై వైసిపి నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో లోకేష్ మీ మనవడే కదా అని అడిగిన ప్రశ్నకు లక్ష్మీపార్వతి స్పందిస్తూ వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.. నాపై నిందలు వేయడం వ్యక్తి, నన్ను ఎన్నో అవమానాలకు గురి చేయడానికి కారణమైన వ్యక్తి వాడు ఎట్టి పరిస్థితుల్లో నా మనవడు కాదు అంటూ లక్ష్మీపార్వతి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. ఏ నాయకుడైనా సొంతంగా మాట్లాడాలని సరిగా పరిజ్ఞానం లేక పేపర్ మీద రాసి ఇచ్చిన ఒకటి రాసిస్తే మరొకటి చదువుతుంటాడు అని ఉన్న పరువు కాస్తా తీసేసారు లక్ష్మీపార్వతి.