Home / SLIDER / ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్

ప్రశాంత్ ను తీసుకొచ్చేందుకు సహాకరిస్తా-మంత్రి కేటీఆర్

ఏపీలోని వైజాగ్ కు చెందిన ప్రశాంత్ ,దరీలాల్ అనే ఇద్దరు యువకులు పాకిస్థాన్ దేశంలోని బహవల్ పూర్ లోని ఎడారిలో దాక్కొన్నట్లు ఈ నెల పద్నాలుగో తారీఖున రాత్రి దాదాపు ఎనిమిది గంటల సమయంలో ఆ ప్రాంతానికి చెందిన గూడచారి చోళిస్థాన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అదుపులోకి తీసుకున్నారు.

వీరిద్దరి వద్ద ఎలాంటి ధ్రువీకరణ పత్రాలేమి లేకపోవడంతో ఆ దేశ కంట్రోల్ ఆఫ్ ఎంట్రీ యాక్ట్ కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. అయితే ప్రశాంత్ అదృశ్యమైనట్లు రెండేళ్ల కిందట ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖున మాదాపూర్ లో కేసు నమోదైన తర్వాత ప్రశాంత్ పాకిస్థాన్ లో ఉన్నట్లు తేలడంతో ప్రశాంత్ కుటుంబం కన్నీరుమున్నీరవుతుంది.

దీంతో మంత్రి కేటీఆర్ స్పందించి ప్రశాంత్ తీసుకురావడంలో అన్ని విధాలుగా సహాకరిస్తానని తెలిపారు. దీంతో పోలీసులు ప్రశాంత్ ఎప్పుడు ఇంటి నుంచి వెళ్లాడు. ఎక్కడకెళ్లాడు. తదితర అంశాల గురించి వాకబు చేసి పూర్తి సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వం తరపున విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యాలయానికి పంపారు. త్వరలోనే ప్రశాంత్ ఇక్కడకు తిరిగి వస్తాడని అధికారులు చెబుతున్నారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat