టీమిండియా మాజీ ఓపెనర్,ఢిల్లీ ఎంపీ అయిన గౌతమ్ గంభీర్ అరుదైన గౌరవం దక్కింది. ఢిల్లీలో ఉన్న అరుణ్ జైట్లీ మైదానంలో ఒక స్టాండ్ కు ఎంపీ గౌతమ్ గంభీర్ పేరు పెట్టనున్నట్లు డీడీసీఏ ప్రకటించింది.
క్రికెట్ రంగంలో ఆటగాడిగా .. ఓపెనర్ గా గంభీర్ అందించిన సేవలకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నాము.దీనికి అపెక్స్ కౌన్సిల్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే రంజీ ట్రోఫీ సీజన్ నుంచి ఈ స్టాండ్ అందుబాటులోకి రానున్నది అని డీడీసీఏ తెలిపింది.
గతంలోనే సెప్టెంబర్ నెలలో మరో స్టాండ్ కు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరును పెట్టారు.