ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష పార్టీ నారా చంద్రబాబు నాయుడు నిన్న బుధవారం మీడియాతో మాట్లాడుతూ” ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ ఆధ్వర్యంలోని వైసీపీ ప్రభుత్వం మద్యపానం నిషేధం తీసుకొచ్చారు.
ఇందులో భాగంగా మద్యపానం ధరలు పెంచారు. ధరలు పెంచడం ద్వారా తిరుపతిలో భక్తులు రాకుండా ఉండేందుకు లడ్డు ధరలు.. రూంల ధరలు పెంచారు. ఈ రెండిటి మధ్య సంబంధం ఉంది కదా అని అన్నారు.
దీంతో తమ మనోభావాలు దెబ్బ తిన్నాయి అని కొంతమంది తిరుపతిలో స్థానిక పోలీసు స్టేషన్ లో భక్తుల మనోభావాలు దెబ్బ తీశారని మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై పిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారని వార్తలు వస్తోన్నాయి.