ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత,ప్రముఖ పారిశ్రామికవేత్త బీద మస్తాన్ రావు (బీఎంఆర్)దిమ్మతిరిగే షాకిచ్చారు.
నిన్న గురువారం తూర్పు గోదావరి జిల్లాలో ముమ్మడివరంలో వైసీపీ అధినేత,ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రపంచ మత్స్య కార దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అయితే అప్పటికే ఆయన వైసీపీలో చేరతారు అని వార్తలు జిల్లా రాజకీయాల్లో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో తాజాగా ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కార్యక్రమానికి హాజరు కావడంపై వైసీపీలో చేరడం ఖాయమని అంటున్నారు విశ్లేషకులు. చూడాలి మరి బీఎంఆర్ ఎప్పుడు వైసీపీ కండువా కప్పుకుంటారో..!