తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ (ఉమ్మడి)జిల్లా పరిధిలోని పరకాల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఈ రోజు శుక్రవారం తన ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో పరకాల రెవిన్యూ డివిజన్ కు చెందిన కళ్యాణ లక్ష్మీ,షాధీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కులను మరియు పట్టాదారులకు పాసుపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా కళ్యాణ లక్ష్మీ చెక్కును అందుకున్న యువతి భావోద్వేగానికి గురైంది.
ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ” నా పెళ్ళికి మా అమ్మనాన్న అప్పు తెచ్చారు. ఎంతో ఘనంగా పెళ్ళి చేశారు. తాహత్ కు మించి అప్పు తెచ్చి పెళ్ళి చేసిన మా అమ్మ నాన్న అప్పు ఎలా తీరుస్తారు అని తెగ బాధపడుతూ ఉండేదాన్ని. అయితే ముఖ్యమంత్రి గారు పేదింటి ఆడబిడ్డలమైన మాలాంటి వాళ్లకు కళ్యాణ లక్ష్మీ లాంటి పథకం తెచ్చారని తెలుస్కుని. దరఖాస్తు చేసుకున్నాను.
ఇప్పుడు ఆ చెక్కును మీ చేతుల మీదుగా అందుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి చేతుల మీదుగా చెక్కును అందుకున్న సందర్భంగా అన్నది. ఆమె ఇంకా మాట్లాడుతూ” *నాకు కేసీఆర్ గారు పెద్దన్న అయితే మీరు చిన్న అన్నగా అండగా నిలబడ్డారు.అప్పుల్లో కూరుకుపోయిన మా కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్ గారికి ధన్యవాదాలు.. మీకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.ఆర్థిక సోమతలేని మా కుటుంబాన్ని కళ్యాణ లక్ష్మీతో ఆదుకున్నారు.మా అమ్మ అప్పు చేసి నా పెళ్లి చేసింది ఇప్పుడు ఈ చెక్కు ఆ అప్పును తీరుస్తుంది.తనతో పాటు అందర్నీ కంటతడపెట్టించింది.