Home / ANDHRAPRADESH / బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!

బీజేపీ ఎంపీ సుజనాచౌదరిపై మండిపడిన వైసీపీ ఎంపీలు..!

బీజేపీలో చేరినా శ్రీమాన్ సుజనాచౌదరి గారికి ఇప్పటికీ బాబుగారి మీద మమకారం పోదు. అసలు మోదీతో మళ్లీ దోస్తానా కోసం సుజనాతో సహా తన నలుగురు ఎంపీలను చంద్రబాబే బీజేపీలో చేర్పించాడన్నది బహిరంగ రహస్యం. అయితే సుజనా చౌదరి ఎంత ప్రయత్నించినా..బీజేపీ పెద్దలు బాబుగారిని దగ్గరకు కూడా రానివ్వడం లేదు..అంతే కాదు చంద్రబాబు కోవర్ట్‌గా పని చేస్తున్న సుజనాపై బీజేపీ అధిష్టానం ఓ కన్నేసి ఉంచింది. అయినా బాబుగారి కోసం తన ప్రయత్నాలు తాను చేస్తూనే ఉన్నాడు. ఇక విషయానికి వస్తే..టీడీపీ నుంచి వైసీపీలోకి వలసలు ఊపందుకున్నాయి. దీంతో ఉలిక్కిపడిన ఎల్లోమీడియా వైసీపీ ఎంపీలు బీజేపీలో చేరుతున్నారంటూ..పచ్చ కథనాలు “కమ్మ”గా వండి వారుస్తోంది..ఎల్లోమీడియా ఛానళ్లకు సుజనా చౌదరి గారు తోడయ్యారు. బాబు గారి ఆదేశాలు అందాయే ఏమో కాని.. ఒక్క వైసీపీ గురించే మాట్లాడితే అనుమానం వస్తుందని..తెలివిగా టీడీపీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరుతున్నారు..అంతకంటే ఎక్కువగా వైసీపీ నుంచి చేరుతారు..ఇప్పటికే కొందరు వైసీపీ ఎంపీలు కూడా బీజేపీతో టచ్‌లో ఉన్నారంటూ సొల్లు కబుర్లు చెప్పాడు. ఇంకేముంది ఎల్లోమీడియా పండుగ చేసుకుంది..బీజేపీలోకి వైసీపీ ఎంపీలు..అదిగో ప్రధాని మోదీ వైసీపీ ఎంపీ రఘురామరాజును రాజుగారు అని పిలిచారు..జగన్ సీరియస్‌గా ఉన్నాడు..అందుకే ఎంపీలంతా విజయసాయిరెడ్డికి చెప్పకుండా ఢిల్లీలో ఎవరిని కలవద్దని ఆర్డరేశాడు..అంటూ ఎల్లోమీడియా రెచ్చిపోయింది.

అయితే సుజనా చౌదరి‌ వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీలు ఘాటుగా స్పందించారు. వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌లో ఉన్నారన్న సుజనా వ్యాఖ్యలను వారు ఖండించారు. బీజేపీతో ఎవరూ టచ్‌లో ఉన్నారో చెప్పాలంటూ సవాల్ విసిరారు. తాజాగా నవంబర్ 22, శుక్రవారం నాడు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ ఎంపీలు సుజనా చౌదరిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. చిత్తూరు ఎంపీ రెడ్డప్ప మాట్లాడుతూ… వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తలుపులు తెరిస్తే టీడీపీ ఖాళీ అవుతుంది. సీఎం జగన్‌ అనుకుంటే అర్థగంటలో అందరూ తమ పార్టీలోకి వచ్చేస్తారు. కానీ అటువంటి పనులకు తమ నాయకుడు దూరమని అన్నారు. ఇక బీజేపీతో వైఎస్సార్ సీపీ ఎంపీలు ఎవరు టచ్‌లో ఉన్నారో చెప్పాలని రెడ్డప్ప డిమాండ్ చేశారు. బీజేపీలో ఉన్న సుజనా చౌదరి ఇంకా టీడీపీ ఏజెంట్‌గా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అసలు సుజనా చౌదరి ఎవరూ అంటే బ్యాంక్‌ దొంగ అని అందరూ అంటారు. గూగుల్‌లో సెర్చ్‌ చేసినా బ్యాంక్‌ దొంగ అనే వస్తుందని సెటైర్లు వేశారు. బీజేపీలో తన పబ్బం గడుపుకోవడానికే వైసీపీ ఎంపీలపై నిందలు వేస్తున్నారు. ముందు బ్యాంకులకు రూ.6 వేలకోట్లు ఎగ్గొట్టిన దానిపై సుజనా చౌదరి మాట్లాడాలని మండిపడ్డారు. ఇక బాపట్ల ఎంపీ నందిగం సురేష్‌ మాట్లాడుతూ… ‘ సుజనా చౌదరి.. ఎంగిలి మెతుకులు తిని మాట్లాడవద్దు. ఏపీలో టీడీపీ చచ్చిపోయింది. భవిష్యత్‌లో బతికే అవకాశమే లేదు. బీజేపీలో ఉంటూ టీడీపీ నాయకుడిలా సుజనా చౌదరి ఎలా మాట్లాడతారు?. మేము రెండు పూటలా తిండి కోరుకునేవాళ్లం. మీకులా బ్యాంకులకు కన్నాలు వేసేవాళ్లం కాదని కౌంటర్ ఇచ్చారు. బ్యాంకులను మోసం చేసిన చౌదరి నీతులు చెప్పడం మానుకో. అరెస్ట్‌ల భయంతో బీజేపీ నేతల కాళ్లు మొక్కి ఆ పార్టీలో చేరావు. జైలుకు వెళ్లకుండా నిన్ను నువ్వు కాపాడుకో. మా మీద ఫోకస్‌ కాకుండా నీ పని చూసుకో. తమతో టచ్‌లో ఉన్నారని అవాకులు చెవాకులు పేలితే తీవ్ర పరిణామాలు తప్పవు అంటూ నందిగాం సురేష్ సుజనాచౌదరికి వార్నింగ్ ఇచ్చారు. సుజనా చౌదరి పార్టీ మారినా…చంద్రబాబు కోవర్టుగా పని చేస్తున్నారని ఆరోపించారు. మొత్తంగా చంద్రబాబు మెప్పు కోసం వైసీపీ ఎంపీలు బీజేపీతో టచ్‌‌లో ఉన్నారంటూ సుజనా చౌదరి ప్రచారం చేయబోయి బొక్కబోర్లాపడ్డాడు. బ్యాంకు దొంగ..నీకు లాగా బ్యాంకులకు కన్నాలు వేయలేదంటూ వైసీపీ ఎంపీల చేత అనిపించుకుని తనకు తానే పరువు తీసుకున్నాడు.. పాపం సుజనా..!

 

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat