కారు లోయలో పడి 8మంది మృతి చెందిన సంఘటన ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. గురువారం రాత్రి కారు వేగంగావస్తూ అదుపుతప్పి లోయలో పడింది. వివరాల్లోకి వెళితే.ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని మొహభత్తా పట్టణ సమీపంలో గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. ఓకుటుంబానికి చెందిన 8మంది ప్రయాణికులు కారులో వేగంగా వెళుతుండగా మొహభత్తా పట్టణ సమీపంలోని లోయలో పడిపోయింది. ఈప్రమాద ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మహిళలు, నలుగురు పురుషులు, ఓ బాలుడు అక్కడికక్కడే మరణించారు. లోయనుంచి మృతదేహాలను అతి కష్టంమీద బయటకు తీసుకువచ్చామని జిల్లాఎస్పీ ప్రశాంత్ ఠాకూర్ చెప్పారు. మృత దేహాలకు శుక్రవారం ఉదయం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేయించి వారి బంధువులకు అప్పగిస్తామని కలెక్టరు శిఖారాజ్ పుత్ తివారీ చెప్పారు. బాధితకుటుంబానికి తక్షణ సాయం కింద రూ.25 వేలను అందించామని కలెక్టరు చెప్పారు.