వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. దాంతో దెబ్బకు బాబు సైలెంట్ అయ్యాడట. ఇక అసలు విషయానికి వస్తే తన ఓటమికి ప్రతీకారంగా అధికార పార్టీ ని ఎలాగైనా ఎదురించాలనే ఆలోచనతో ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేసాడు. కాని ఏ ఒక్కటీ ఫలించకపోగా తిరిగి వారికే తేడా కొట్టేది. అయితే చివరికి చంద్రబాబు ఇప్పుడు పార్టీ రంగుల విషయంలో గెలుకుంటున్నాడు. దీనిపై గట్టి కౌంటర్ ఇచ్చాడు విజయసాయి రెడ్డి. “దిమ్మెలకు కూడా వైఎస్ఆర్సీపీ రంగులు వేస్తున్నారని చంద్రబాబు గుడ్డలు చింపుకుంటున్నాడు. అప్పడాల పైన, నీళ్ల పాకెట్ల పైన ఫోటోలు వేయించుకున్న విషయం మీరు మర్చినా ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. గుళ్లలో కూడా పసుపు రంగు వేయించలేదా బాబూ?” అని ప్రశ్నించడంతో బాబు కిక్కురుమనకుండా సైలెంట్ అయ్యారట.
దిమ్మెలకు కూడా @YSRCParty రంగులు వేస్తున్నారని @ncbn గుడ్డలు చింపుకుంటున్నాడు. అప్పడాల పైన, నీళ్ల పాకెట్ల పైన ఫోటోలు వేయించుకున్న విషయం మీరు మర్చినా ప్రజలు ఇంకా గుర్తు పెట్టుకున్నారు. గుళ్లలో కూడా పసుపు రంగు వేయించలేదా బాబూ?
— Vijayasai Reddy V (@VSReddy_MP) November 23, 2019