టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. కలకత్తాలోని ఈడెన్ వేదికగా జరుగుతున్న తొలి పింక్ డే/నైట్ మ్యాచ్ లో టీమిండియా బౌలర్ ఇషాంత్ శర్మ ధాటికి కేవలం 106 పరుగులకే బంగ్లాదేశ్ ఆలౌటైంది.
అనంతరం తొలి ఇన్నింగ్స్ మొదలెట్టిన టీమిండియా మూడు వికెట్లను కోల్పోయి 174పరుగులు చేసింది. ఈ క్రమంలో కోహ్లీ శరవేగంగా టెస్టుల్లో 5000పరుగులు చేసిన కెప్టెన్ గా రికార్డును సొంతం చేసుకున్నాడు.
ఈ టెస్టులో తన 32వ పరుగు వద్ద కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు. దీంతో ఆసీస్ మాజీ కెప్టెన్,దిగ్గజం పాటింగ్ రికార్డును కోహ్లీ బద్దలు కొట్టాడు. పాటింగ్ 54 మ్యాచ్ ల్లో (97ఇన్నింగ్స్ లో) 5000 పరుగులను సాధిస్తే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం కేవలం 53 మ్యాచ్ ల్లో (86 ఇన్నింగ్స్ లో)నే ఈ ఫీట్ సాధించాడు.