సీఎం రమేష్. కాంట్రాక్టర్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకూ ఆయన ప్రస్థానంలో అనేక ఆసక్తికర ఘటనలున్నాయి. టీడీపీ నుంచి బీజేపీ వరకూ సాగిన రాజకీయ పయనంలో అనేక కీలక మలుపులున్నాయి. అయితే తాజాగా ఆయన ఇంట్లో సాగుతున్న వివాహ నిశ్చితార్థ వేడుక హాట్ టాపిక్ గా మారింది. సీఎం రమేష్ తనయుడు రిత్విక్ నిశ్చితార్థ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతున్నట్లు సమచారం. దుబాయ్ లోని రసాల్ ఖైమా కి చెందిన వాల్డ్రాఫ్ ఆస్టోరియా వేదికగా ఈ నిశ్చితార్థం జరగతుంది. రిత్విక్ కి ప్రముఖ పారిశ్రామికవేత్త రాజా తాళ్లూరి కుమార్తె పూజతో వివాహం జరుగుతుంది.
ఈ వివాహ వేడుకను ప్రత్యక్షంగా తిలకించేందుకు సుమారుగా 75 మంది ఎంపీలు ఇండియా నుంచి దుబాయ్ వెళ్లినట్లు తెలుస్తుంది. వారి కోసం ప్రత్యేకంగా 15 విమానాలను సీఎం రమేష్ ఏర్పాటు చేశారని సమచారం. ఈ వేడుక తర్వాత దుబాయ్ వెళ్లే అతిథులకు మూడు రోజుల పాటు సకల సదుపాయాలతో ఆతిథ్యం ఇచ్చేందుకు భారీ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తోంది. పలువురు కేంద్ర మంత్రులు హాజరయ్యే అవకాశం ఉంది. సీఎం రమేష్ కి కాబోయే వియ్యంకుడు రాజా తాళ్లూరికి ఇటీవల యూఎస్ లో ఓ భారీ డీల్ కుదిరినట్టు తెలుస్తోంది. దాని ద్వారా వేల కోట్ల ఆదాయం ఆయనకు సమకూరినట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే నిశ్ఛితార్థం కనివినీ ఎరుగని రీతిలోనిర్వహించి. దుబాయ్ లో సకల సదుపాయాలు ఏర్పాటు చేయడమే కాకుండా చివరకు దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో ప్రత్యేక అనుమతులు తీసుకని వస్తున్న అతిథులకు రాచమర్యాదలు సిద్ధం చేసినట్టు సమాచారం. ఇక నిశ్చితార్థమే ఇలా ఉంటే పెళ్లి ఏ రేంజ్ లో ఉంటుందోననే ఆసక్తి కనిపిస్తోంది.