23 వ జాతీయ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ – 2019 నిర్వాహణ పై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ V. శ్రీనివాస్ గౌడ్ గారి కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశం లో రాష్ట్ర సెపక్ టక్రా రాష్ట్ర అసోసియేషన్ కార్యదర్శి శ్రీ ప్రేమ్ రాజ్, ఉపాధ్యక్షులు శ్రీ. ఐలయ్య యాదవ్ , ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు శ్రీ.రాజేశ్వర్, వికేశ్ కుమార్, శ్రీకాంత్, కార్తిక్ లు పాల్గొన్నారు.
23 వ జాతీయ జూనియర్ సెపక్ టక్రా ఛాంపియన్ షిప్ ను తెలంగాణ రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ మరియు సెపక్ టక్రా ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో చాదర్ ఘట్ లోని విక్టరీ ప్లే మైదానం లో డిసెంబర్ 11 నుండి 15 వరకు నిర్వహిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ కు కార్యవర్గ సభ్యులు వివరించారు. ఈ ఛాంపియన్ షిప్ లో 27 రాష్ట్రాల నుండి సుమారు 600 మంది క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు.
ఛాంపియన్ షిప్ ను ప్రారంభించటానికి ముఖ్య అతిథిగా పాల్గొనాలని మంత్రి ని కోరారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు మాట్లాడుతూ… గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆదేశాల మేరకు రాష్ట్రంలో క్రీడల అభివృద్ధి కి, క్రీడాకారులకు ప్రోత్సాహకాన్ని అందిస్తున్నామన్నారు. సెపక్ టక్రా క్రీడను రాష్ట్రంలో ప్రోత్సహిస్తామన్నారు. సెపక్ టక్రా జాతీయ జూనియర్ ఛాంపియన్ షిప్ ను ఘనంగా నిర్వహించాలని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వం తరుపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్.