ప్రముఖ సినీ హీరో,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా యాబై కోట్ల వరకు డిమాండ్ చేస్తోన్నారు. చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ బాలీవుడ్ లో ఘన విజయం సాధించిన పింక్ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెల్సిందే.
ప్రముఖ దర్శకుడు వేణు శ్రీరామ్ దర్శకత్వంలో భోనీ కపూర్,దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నాడని ఫిల్మ్ నగర్లో వినిపిస్తోన్న గుసగుసలు.
అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి అధికారక ప్రకటన వెలువడలేదు. పవన్ కళ్యాణ్ నటించిన అఖరి చిత్రం అజ్ఞాతవాసి. ఈ మూవీ అట్టర్ ఫ్లాప్ అయిన విషయం కూడా మనకు విదితమే.