తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి విదితమే. అయితే సమ్మె ప్రభావం కన్పించకుండా ఇటు ఆర్టీసీ యజమాన్యం,ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసిన.. ఎన్ని చర్యలు తీసుకున్న కానీ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మాత్రం అక్కడక్కడ ప్రయాణికులు ఇబ్బందులను ఎదుర్కుంటున్నారు.
ఈ క్రమంలో ఉద్యోగులతో పాటు స్కూళ్లకు,కాలేజీలకెళ్లే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందులో భాగంగా బస్సు అందక నగరంలో రేతిబౌలి ప్రాంతంలో కళాశాల అమ్మాయిలు ఫుట్ బొర్డుపై ప్రయాణిస్తోన్న ప్రమాదకర ఫోటోను ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీనిని నెటిజన్లు షేర్ చేస్తూ అమ్మాయిలూ జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు.