Home / SLIDER / నేటితో ఆర్టీసీ ఉత్కంఠకు తెర

నేటితో ఆర్టీసీ ఉత్కంఠకు తెర

తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ సిబ్బంది గత యాబై రెండు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తోన్న సంగతి విదితమే. సమ్మె చేస్తోన్న సమయంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగం చేయాలనుకునేవారు భేషరతుగా వచ్చి విధుల్లో చేరాలని రెండు మూడు సార్లు ప్రకటించింది. అయిన కానీ ఆర్టీసీ సిబ్బంది వెనక్కి తగ్గలేదు.

కోర్టు మెట్లు ఎక్కిన ఆర్టీసీ సిబ్బందికి హైకోర్టు లేబర్ కోర్టుకు కేసును బదలాయిస్తూ.. ప్రభుత్వం దయచూపి విధుల్లోకి తీసుకోవాలని.. రూట్ల ప్రైవేటీకరణలో ప్రభుత్వానికే సర్వహక్కులని తీర్పునిచ్చింది. దీంతో చేసేది ఏమి లేక ఆర్టీసీ సిబ్బంది మరల సమ్మెకు దిగింది. ఈ రోజు సోమవారం ఆర్టీసీ ప్రస్తుత పరిస్థితులపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.

ఈ సమావేశంలో రూట్ల ప్రైవేటీకరణ,తమను భేషరతుగా విధుల్లోకి చేర్చుకుంటే సమ్మె విరమిస్తామని ఆర్టీసీ జాక్ చేసిన డిమాండ్ పై చర్చించనున్నారని సమాచారం. అనంతరం ఈ కీలక పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేసే అవకాశాముంది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనకోసమే ఆర్టీసీ సిబ్బంది ఎదురుచూస్తుంది.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat