తాజా ఎన్నికల్లో ఘోరంగా ఓటమి పాలైన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆయన పార్టీ శ్రేణులు రాజకీయ మనుగడ ప్రశ్నార్థకం అవడంతో పలు వ్యూహాలకు పదును పెడుతున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కులాలకు సంబంధించి కాపుల రిజర్వేషన్ అంశం పై పెద్ద ఎత్తున విద్వేషాలు కలిగేలా ప్రవర్తించిన విషయం తెలిసిందే. 2014 ఎన్నికలకు ముందు కాపులను బీసీల్లో చేస్తానని హామీ ఇచ్చిన చంద్రబాబు అనంతరం ఆ హామీని నెరవేర్చాలని అడిగినందుకు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికక్కడ అరెస్టులు చేయించారు అనేక అంశాలకు ఈ పరిణామాలు దారితీశాయి.. అనంతరం గుంటూరులో జరిగిన ఓ సభలో ముస్లిం యువకులను అరెస్టు చేసి జైలుకు కూడా పంపించారు. అయితే తాజాగా ముఖ్యమంత్రి జగన్ పాలనపై విమర్శలు చేయడానికి సహేతుకమైన వాదనలు లేకపోవడంతో రాష్ట్రంలో మత విద్వేషాలను రెచ్చగొట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోంది.
ఇందులో భాగంగా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా పలు దేవుళ్లకు మతం రంగు పులుము తున్నారు దీనికి జనసేన యథా రాజా తథా ప్రజా అన్నట్టుగా ఆడుతుండగా బిజెపి గుడ్డిగా నమ్ముతూ ఈ మూడు పార్టీలు వైసీపీ పై విషం కక్కేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో క్రైస్తవులు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా కుట్రలు చేసి హిందువులను రెచ్చగొట్టి క్రైస్తవుల పై వ్యాఖ్యలు చేయించి తద్వారా క్రైస్తవులతో హిందువులపై దాడులు చేయించి ఎలాగా మత చిచ్చు రేపేందుకు కుట్రలు జరుగుతున్నాయట.. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతోంది. గత కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయిన యనమల నాగార్జున యాదవ్, బీదా రవిచంద్ర రెడ్డి ఇవే అంశాల్ని టివి డిబేట్లలో సైతం నేరుగానే ప్రస్తావిస్తున్నారు.