Home / TELANGANA / ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

ప్రియాంక రెడ్డి ఘటనపై మోదీకి ట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్

వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి ఘటనపై రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో తీవ్రంగా స్పందించారు. వైద్యురాలి హత్యపై ప్రధాని మోదీకి కేటీఆర్ ట్వీట్‌ చేశారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడేవారికి తక్షణమే శిక్షలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో ఓ సందేశాన్ని పోస్ట్‌ చేశారు.

 

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా జరుగుతున్న పలుఅత్యాచార ఘటనలకు కఠిన శిక్షలు పడేలా చట్టాలను పరిస్థితులకు తగ్గట్లు సవరించాలి. ఇలాంటి దారుణాలకు పాల్పడాలంటేనే చేసేవాళ్లు భయపడేలా.. నేరం చేయకుండా ఉండేలా తీవ్రమైన కఠిన శిక్షలు విధించాలి. దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటన ఇప్పటికి ఏడేైళ్లెనా ఆ దారుణాలకు పాల్పడిన దోషులకు మాత్రం ఉరిశిక్ష పడలేదు. రాష్ట్రంలో ఇటీవల జరిగిన 9నెలల చిన్నారిపై అత్యాచారం ఘటనలో కింది కోర్టు విధించిన ఉరి శిక్షను హైకోర్టు యావజ్జీవ శిక్షగా మార్చింది. ఇలాంటి పరిస్థితుల్లో యువతి కుటుంబానికి మనం ఎలా హామీ ఇవ్వగలం? ఐపీసీ, సీఆర్‌పీసీ చట్టాలను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అత్యాచారం చేసేవాళ్లు అప్పీల్‌కు అవకాశం లేకుండా ఉరిశిక్ష విధించాలి.ఇలాంటి నేరాలకు పాల్పడేవారికి శిక్షలు వేగంగా అమలు చేయాలి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రస్తుత ప్రజల డిమాండ్‌ మేరకు ఈ పార్లమెంట్‌ సమావేశాల్లోనే చట్టం తేవాలి. ఈ సమావేశాల్లోనే పూర్తి స్థాయిలో చర్చలు జరగాలని కేటీఆర్‌ తెలిపారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat