షాద్నగర్ సమీపంలో జరిగిన దిశ హత్యాచారం కేసు యావత్ దేశాన్ని కుదిపేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులపై సత్వరమే విచారణ జరిపి..వెంటనే ఉరితీయాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసు విచారణను వేగవంతంగా కొనసాగించేందుకు అనుమతి ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు లేఖ రాసింది. ఈ క్రమంలోనే ఇవాళ జస్టిస్ ఫర్ దిశ కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ కేసు విచారణను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు మహబూబ్నగర్లో ఫాస్ట్ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయనుంది. మహబూబనగర్ డిస్ట్రిక్ట్ కోర్టు సెషన్స్ జడ్జిని నియమిస్తూ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.