ఐఎన్ఎక్స్ మీడియా కేసులో జైలుపాలైన కేంద్ర మాజీ మంత్రి చిదంబరానికి ఎట్టకేలకు ఊరట లభించింది. రూ.2 లక్షల పూచీకత్తుపై సుప్రీం కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్ను మంజూరు చేసింది. అక్టోబర్ 21న చిదంబరంను ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసినదే. సుమారు 105 రోజుల జైలు జీవితం తర్వాత ఆయనకు విముక్తి కలిగించింది కోర్టు. అంతేకాకుండా చిదంబరం దేశం వదిలి వెళ్లకూడదని ఎప్పుడు విచారణకు పిలిచినా అందుబాటులో ఉండాలనే షరతుల తో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు గురించి ఎవరితోనూ చర్చించకూడదని.. బహిరంగంగా ఇంటర్వ్యూలు, ప్రసంగాలు ఇవ్వకూడదని ఈ కేసుకు సంబందించిన వ్యక్తులను ప్రభావితం చేయరాదని కోర్టు సూచించింది. కాగా, సాయంత్రం తీహార్ జైలు నుంచి చిదంబరం విడుదల కానున్నారు.
Tags bail chidambaram ex finance minister supreme court
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023
లోకేష్ ఓ పనికిమాలిన పొలిటీషియన్..ఏం మాట్లాడుతాడో వాడికే అర్థం కాదు..మంత్రి రోజా ఫైర్..!
August 30, 2023
NTR Coin : ఎన్టీఆర్ స్మారక నాణెం విడుదల కార్యక్రమాన్ని కూడా తన రాజకీయాలకు వాడుకుంటున్న బాబు ..
August 28, 2023
AP Politics:రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలల్లో మొబైల్ ఫోన్లపై నిషేధం విధించిన ఏపీ ప్రభుత్వం ..
August 28, 2023
CM Jagan:పేద విద్యార్థుల పెద్ద చదువులకు అయ్యే ఖర్చు అంతా ప్రభుత్వానిదే .. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం..
August 28, 2023
Fees Reimbursement :పిల్లల భవిష్యత్తు మార్చబోయే పథకమైన విద్యా దీవెన నిధులు సీఎం జగన్ చేతుల మీదిగ విడుదల
August 28, 2023
పవన్ కళ్యాణ్ విసన్నపేట పర్యటన కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉంది – మంత్రి అమర్నాథ్
August 14, 2023