నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టోరీ సినిమా తెరకెక్కనుంది. దీని కోసం శేఖర్ టీచర్గా మారాడు. తెలంగాణ యాస మాట్లాడేందుకు చైతుకు శిక్షణ ఇచ్చారు. ఎందుకంటే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘లవ్స్టోరీ’ సినిమాలో నాగచైతన్య తెలంగాణ కుర్రాడి నేపద్యం లో సాగనుంది. ఇందులో సాయిపల్లవి కథానాయికగా నటిస్తుంది. నారాయణ్దాస్ కె. నారంగ్, పి. రామ్మోహనరావు నిర్మిస్తున్న ఇప్పటికే ఈ చిత్రం తొలి షెడ్యూల్ పూర్తయింది.
కథ విషయానికి వస్తే.. ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదలతో ఓ మారుమూల గ్రామం నుంచి హైదరాబాద్ వచ్చే యువకుడిగా నాగచైతన్య, కలను నిజం చేసుకోవాలనుకునే తపనతో తన ఊరి నుంచి హైదరాబాద్ చేరుకునే యువతిగా సాయిపల్లవి నటిస్తున్నారు. వీరిద్దరి మధ్య ఎలా ప్రేమ మెుదలౌతుంది. ఆ తర్వాత ఎలాంటి పరిస్థితులను ఎదురయ్యాయి అనే అంశాల నేపథ్యంలో ఈ కథ సాగనున్నది.ఈ ‘లవ్స్టోరీ’విడుదలకు తేదీ ఖరారు చేశారని సమాచారం. ఏప్రిల్ 2న సినిమాని విడుదల చేయాలనుకుంటున్నారట.