వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అంచనాలకు మించి ఇచ్చిన హామీలన్నింటిని కార్యరూపం దాలుస్తుంది. ఇప్పుడు మరొక కీలక నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జిల్లా వాసుల చిరకాల స్వప్పమైన స్టీల్ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి పెద్దనందులూరు పంచాయతీల మధ్య ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు అనుమతులు జారీచేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 26న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్ ప్లాంట్ శంకుస్థాపన చేయుటకు తేదీని ఖరారు చేసారు.
2013 కంపెనీల చట్టం ప్రకారం ఈ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఉక్కు కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. వంద శాతం పెట్టుబడులను రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుందని ఉత్తర్వుల్లో పేర్కొంది. స్టీల్ప్లాంట్ నిర్మాణం కోసం 2019-20 బడ్జెట్లో రూ. 250కోట్లను కేటాయించిన విషయం తెలిసినదే. పరిశ్రమశాఖ ముఖ్య కార్యదర్శి రజత్ భార్గవ, గనుల శాఖ కార్యదర్శి కె.రామ్ గోపాల్ను డైరెక్టర్లుగా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం వైఎస్ఆర్ జిల్లా వాసుల్లో ఆనందాలు వెల్లువెత్తాయి. స్థానికులకు ఉద్యోగావకాశాలు కలుగుతాయని యువత హర్షం వ్యక్తం చేస్తున్నారు.