Home / CRIME / జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?

జైలునుండి విడుదలైన చిదంబరం రోజంతా ఏం చేశారో తెలుసా.?

బెయిల్‌పై నిన్న రాత్రి విడుదలైన కేంద్రమాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత పి.చిదంబరం గురువారం పార్లమెంట్‌ సమావేశాలకు హాజరయ్యారు. దేశంలో ఉల్లిధరలు ఆకాశాన్నంటుతున్న వేళ..  పార్లమెంట్‌ భవనం వద్ద కాంగ్రెస్‌ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయానికి వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక నిర్వహించిన తొలి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అంతిమంగా న్యాయమే గెలుస్తుందన్న నమ్మకం నాకు ఉంది. మంత్రిగా ఉన్న సమయంలో నేను ఏం చేశానో అందరికీ తెలుసుసని, నాతో పనిచేసిన అధికారులు, నన్ను గమనించిన జర్నలిస్టులకు నేనేంటో తెలుసునని
చిదంబరం అన్నారు.

తిరోగమనంలో ఉన్న ఆర్థిక వ్యస్థను మెరుగు పరచే చర్యలపై భాజపా ప్రభుత్వం దృష్ఠసారించాలని . ఆర్థిక పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడూ మాట్లాడటంలేదని వ్యాఖ్యానించారు. ఉల్లిధరలు పెరిగినా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదని గుర్తుచేశారు. ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారు.. వాటిని గూర్చి పట్టించుకోవడంలేదు అంటూ విమర్శించారు. దేశంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, మూకదాడుల గురించి విలేకరులు ప్రశ్నించినప్పుడు ఆయన భావోద్వేగానికి గురయ్యారు. ఆర్థిక మందగమనం నుంచి బయటపడవచ్చని అన్నారు. ప్రభుత్వం అసమర్థంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక నిర్ణయాలు తిరోగమనంలో ఉన్నాయని విమర్శించారు. ప్రభుత్వం తప్పుడు విధానాలతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారనీ చిదంబరం వ్యాఖ్యానించారు.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat