చిత్తూరు జిల్లా పర్యటనలో జనసేన అధినేత పవన్ కల్యాణ్కు ఊహించని అనుభవం ఎదురయింది. అనంతపురం జిల్లా డ్వాక్రా మహిళా సంఘమిత్ర సొసైటీ సభ్యులతో పవన్ భేటీ సందర్భంగా ఆసక్తికర ఘటన జరిగింది. ఆ సమావేశంలో సీఎం జగన్ ప్రస్తావన రావడతో అక్కడున్న వారంతా షాకయ్యారు. ఓ మహిళ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. ‘జనసేన అధినేత జగనన్నకు నమస్కారం’ అని అనడంతో జనసేన కార్యకర్తలు ఉలిక్కిపడ్డారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ అనబోయి పొరపాటున ఆమె ‘జగనన్న’ అని ఆమె సంబోధించింది.
ఆమె ప్రసంగంతో జనసేన సభా ప్రాంగణం నవ్వులతో నిండిపోయింది. అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు. ఇక తన సభలో సీఎం జగన్ ప్రస్తావన రావడంతో పవన్ కల్యాణ్ షాక్ తిన్నారు. కొద్ది సేపటి దాకా ఆయన తేరుకోలేదు. వెంటనే స్పందించిన జనసేన కార్యకర్తలు.. ఇది వైసీపీ మీటింగ్ కాదని.. జనసేన మీటింగ్ అని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.
మహిళలు అంతే ఆ పౌడర్ నాయుడు పేరు పలకటానికి కూడా ఇష్టపడరు
Posted by Ravindra Reddy Ippala on Thursday, 5 December 2019