తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హారీష్ రావు నిన్న ఆదివారం హుస్నాబాద్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కోహెడ మండలం సముద్రాల గ్రామానికి చెందిన చింతకింది కుమార్ ,శారద తనయుడైన వర్శిత్ ఎనిమిది నెలల కిందట చెట్టుపై నుండి పడిపోయాడు.
దీంతో ఆరోగ్య శ్రీ లేకపోవడం.. డబ్బులు లేకపోవడంతో ఎనిమిది నెలలుగా బాధపడుతున్నాడు. మంత్రి హారీష్ రావు హుస్నాబాద్ నియోజకవర్గానికి వస్తున్నాడని విషయం తెలుసుకున్న వర్శిత్ తల్లిదండ్రులు మంత్రి హారీష్ ను కలిసి విన్నవించుకున్నారు.
దీనికి వెంటనే స్పందించిన మంత్రి హారీష్ రావు వర్శిత్ మెరుగైన వైద్యం కోసం రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ లోని ప్రముఖ ఆసుపత్రిలో చేరాలని సూచించారు. అంతే కాకుండా భవిష్యత్తులో ఏదైన సాయం కావాలంటే తనను ప్రత్యేక్షంగా కలవాలని భరోసానిచ్చారు మంత్రి.