తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ అందరికీ ఆదర్శంగా నిలిచారు. లంచం తీసుకున్నా తన పని చేయడం లేదని ఒక రైతు చేసిన ఫిర్యాదుపై జగిత్యాల జిల్లా కలెక్టర్ శరత్ స్పందించారు.
కొడిమ్యాల మండలం నాచుపల్లికి చెందిన నర్సయ్య అనే రైతు తన పేరు మీద ఉన్న భూమికి పట్టా ఇవ్వాలని వీఆర్ఏ మహేష్ కు రూ పదివేలు ఇచ్చాడు. అయిన కానీ పట్టా ఇవ్వడం లేదని కలెక్టర్ శరత్ కు ఫిర్యాదు చేశాడు నర్సయ్య.
విచారణ చేపట్టిన కలెక్టర్ భూమి పట్టాతో పాటుగా మహేష్ తీసుకున్న పదివేల రూపాయల లంచాన్ని కూడా తిరిగి ఇప్పించాడు. వెంటనే వీఆర్ఏను కలెక్టర్ శరత్ సస్పెండ్ చేశారు..