సోమవారం గుడివాడ రైతుబజారులో మృతి చెందిన సాంబిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మంత్రి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబువి శవ రాజకీయాలని ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం ఆయనకు అలవాటాని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని విమర్శించారు. సాంబిరెడ్డి ఆర్టీసీలో పనిచేస్తూ గుండె సమస్యతో 15 ఏళ్ల కిందట ఉద్యోగానికి రాజీనామా చేశారని, ఆయనకు స్టెంట్ కూడా వేశారని ఆయనకు అంతగా ఆరోగ్యం భాగోడని కుటుంబ సభ్యులు తెలియజేసారు . ఎల్లో మీడియా ప్రతినిధులు ఆయన కుటుంబసభ్యులకు ఫోన్చేసి ఉల్లిపాయల కోసం లైన్లో నిలబడి మృతి చెందారని చెబితే ప్రభుత్వం నుంచి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా వస్తుందని ఆవిధంగా వక్రీకరించి చెప్పమన్నారని తెలియజేసారు.ap
శాసనసభ జరుగుతుండగా సాంబిరెడ్డి ఫొటోను చంద్రబాబు అసెంబ్లీలో ప్రదర్శించారని.. ఉల్లి కోసం జరిగిన తొక్కిసలాటలో గుడివాడలో వ్యక్తి మృతి చెందాడంటూ అలజడి సృష్టించే ప్రయత్నం చేసారని. వెంటనే తాను ఆరాతీయగా.. అలాంటిదేమీ లేదని కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. చంద్రబాబు ఈవిధమైన శవ రాజకీయాలకు కూడా దిగజారుతున్నారని ఆయనకు తోడు జనసేన అధ్యక్షుడు పవన్ కూడా వంత పాడటం దిగజారుడు రాజకీయమన్నారు. సంబంధిత మీడియా యాజమాన్యంపై పరువు నష్టం దావా వేస్తామని సాంబిరెడ్డి కుటుంబీకులు తెలియజేశారని అన్నారు.